యువకుడి ఆత్మహత్యాయత్నం

సిరా న్యూస్,రాయచోటి;
రాయచోటి తహశీల్దార్ కార్యాలయం తనకు అన్యాయం చేస్తోందని అర్షద్ అహమ్మద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయచోటి శిఫా హాస్పిటల్ పక్కన నివాసం ఉన్న అర్శద్ తనకు గున్నికుంట్ల రోడ్ లో ఉన్న 75 సెంట్ల భూమిని మరికొందరు వ్యక్తులు ఆన్లైన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న అర్శద్ తండ్రి సులేమాన్ మూడేళ్లుగా న్యాయం కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి గతంలో చనిపోయాడు. తన భూమిని వేరే వ్యక్తులు ఆన్లైన్ చేయించు కున్నారని న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఏళ్లుగా తిరుగుతున్నా కార్యాలయ ఉద్యోగులు పట్టించుకోక పోవడంతో విసిగి కార్యాలయ ఆవరణలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే పక్కనే ఉన్న వ్యక్తులు వారిస్తూ అడ్డుకున్నారు. వెంటనే అతని పై పైప్ తో నీళ్ళు చల్లి కాపాడారు. అనంతరం పోలీసులు అర్శద్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు…
35నేను కాంగ్రెస్ లో చేరడంలేదు
డిప్యూటీ మేయర్ శ్రీలత
సికింద్రాబాద్
కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లకు హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీ లతా శోభన్ రెడ్డి కొట్టి పారేశారు. సికింద్రాబాద్ లోని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సికింద్రాబాద్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఈ జోనల్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు పెళ్ళిలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకే సమావేశం జరపడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ కూడా వారి చేతిలోనే ఉండడం వలననే రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని అన్నారు. ఇందులో రాజకీయాల ప్రస్తావనే లేదని చెప్పారు. మేము స్వతహాగా వెళ్లి కలవడం జరిగిందని, ఇందులో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసి యుద్దిన్ ప్రమేయం లేదని, అక్కడ యాదృచ్ఛికంగా కలిసి మాతో పాటు పోటో దిగడం జరిగిందని వివరించారు. బాబా ఫసియుద్దిన్ సామాజిక మాధ్యమాల్లో మేము కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోస్ట్ చేసిన విషయం మాకు తెలియదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *