దయచేసి వ్యవస్థలను కాపాడండి
మండలి బుద్ధప్రసాద్
సిరా న్యూస్,అవనిగడ్డ;
కృష్ణాజిల్లా కలెక్టర్ రాజబాబు నిజాయితీగల కలెక్టర్ అయితే శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాలలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరపాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం గ్రామస్తులు ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేసిన పట్టించుకోకుండా మంగళవారం తొట్లవల్లూరు వెళ్లి అక్కడ ఇసుక అక్రమ రవాణా జరగడం లేదు అని ఎస్ ఈ టి రిపోర్టులో వ్రాయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తొట్లవల్లూరు వెళ్లిన కలెక్టర్ కి పక్కనే ఉన్న శ్రీకాకుళం, పాపవినాశనం వద్ద విచ్చలవిడిగా తోలుతున్న ఇసుక కనిపించలేదా అని ప్రశ్నించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ రాజబాబు నిజాయితీగల, నిబద్ధత గల అధికారి అయితే ఈరోజైనా శ్రీకాకుళం, పాపవినాశనం క్వారీలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని అన్నారు.
================