సిరా న్యూస్, చిగురుమామిడి:
కానిస్టేబుల్ నియామక పత్రాలు అందుకున్న బొమ్మనపల్లి యువకులు…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ యువకులు కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటారు. బుధవారం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో, ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. బొమ్మనపల్లి కి చెందిన దరిపల్లి శ్రీనివాస్ (ఫైర్ కానిస్టేబుల్), మిట్టపల్లి ప్రేమ్ కుమార్ (కమ్యూనికేషన్ కానిస్టేబుల్), కొలిపాక జీవన్ (ఎక్సైజ్ కానిస్టేబుల్), తాళ్లపల్లి రంజిత్ (ఏఆర్ కానిస్టేబుల్) గా నియమక పత్రాలు అందుకున్నారు. ఎంతో కష్టపడి జాబ్ సాధించిన వీరిని పలువురు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.