సిరా న్యూస్ ,కుందుర్పి
సమస్యల పరిష్కారానికి కృషి
*ఎంపీ తలారి రంగయ్య
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. గురువారం కంబదూరు మండలం పరిధిలోని కురాకుల పల్లి, అయ్యం పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రహ్మసముద్రం మండలం పరిధిలోని గుండుగానిపల్లి గ్రామం లో వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ కేంద్రం నూతన భవనాలను ప్రారంభిస్తామని తెలిపారు.అనంతరం కంబదూరు మండలం లోని కురాకులపల్లి అచ్చంపల్లి గ్రామంలో నిర్వహించిన ఆత్మయాల పులకరింపు కార్యక్రమంలో పాల్గొని వైకాపా కుటుంబ సభ్యులు సమస్యల గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకున్నారు.