సిరా న్యూస్ ,కుందుర్పి
ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తా
*ఎంపీపీ నాగరాజు
*దుర్గమ్మ ఆలయానికి విరాళం అందజేత
దుర్గమ్మఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీపీ నాగరాజు అన్నారు. గురువారం కుందుర్పి మండలంలోని జంబు గుంపల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయానికి కుందుర్పి (మండల పరిషత్ అధ్యక్షులు,) ఎంపీపీ కమలమ్మ నాగరాజు తన వంతు సాయంగా అందజేశారు. దేవాలయ నూతన నిర్మాణానికి రూ.10,116 (పదివేల నూట పదహారు రూపాయలు,) విరాళంగా అందించారు. ఈసందర్బంగా ఎంపీపీ నాగరాజు మాట్లాడుతూ దుర్గమ్మ గుడి నిర్మాణానికి తన వంతు సహాయంగా ఎప్పుడు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దుర్గమ్మ ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.