సిరా న్యూస్, జైనథ్:
జైనథ్ మండల సర్వసభ్య సమావేశం వాయిదా…
ఈనెల 16 న నిర్వహించనున్న ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో ఏ రవీంద్రనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. సర్వసభ్య సమావేశం నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. మండల పరిషత్ సభ్యులు, అధికారులు గమనించి సహకరించాలని కోరారు.