సిరా న్యూస్,నందికొట్కూరు;
నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే& వైసీపీ సీనియర్ నేత లబ్బి వెంకటస్వామి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. నందికొట్కూరు బాధ్యతలు నాన్ లోకల్ కు చెందిన సుధీర్ దారకు అప్పగించడంపై నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. – నందికొట్కూరు బాధ్యతలు సుధీర్ దారకు అప్పగించడంతో.. మరి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి సహకరిస్తారా? విబేధిస్తారా ? అనే అంశం ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. లబ్బి వెంకటస్వామి త్వరలో తన అనుచరులు, కార్యకర్తలతో కలసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. లబ్బి వెంకటస్వామి వైసీపీలో కొనసాగుతారా? పార్టీ వీడుతారా ? అనే అంశంపై అటు కార్యకర్తల్లో, ఆయన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.