తిరుపతిని రాజధానిగా చేయాలి

మాజీ ఎంపీ చింతా మోహన్
 సిరా న్యూస్,విజయవాడ;
బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం లో తిరుపతి రాజధాని అని చెప్పారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూల్ రాజధాని చేశారు. తరువాత హైద్రాబాద్ ను , ఇప్పుడు తుళ్లూరు ను రాజధాని చేశారు. తిరుపతి రాజధానిగా కావాలి. రాయలసీమ బాగుపడాలంటే తిరుపతి రాజధానిగా చేయాలని మాజీ ఎంపి చింతా మోహన్ అన్నారు. మాకు మిగిలింది రాళ్లు మాత్రమే. హైద్రాబాద్ రాజధానిగా అయ్యాక బాగా అభివృద్ధి చెందింది. తిరుపతి అంటే అందరికి ఆమోదం , లక్ష ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఉంది. విమానాశ్రయం, 7 జాతీయ రహదారులు ఉన్నాయి చక్కటి వాతావరణం ఉంది. స్వార్ధ రాజకీయాలు కోసం జగన్ మూడు రాజధానులంటుంటే , చంద్రబాబేమో తుళ్లూరు రాజధాని అన్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం అన్ని జరిగాయి. ఇది కూడా జరగాలి. రాష్ట్ర రాజకీయాలు పాకిస్తాన్ కంటే దిగజారిపోయాయి. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ని కోరుకుంటున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదం తో తెదేపా పుట్టింది, మరి అర్ధరాత్రి అమిత్ షా తో చర్చలు జరపాల్సిన అవసరం ఏంటి. షర్మిల చేరిక కాంగ్రెస్ మైలేజ్ ని పెంచింది ,కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. షర్మిల ను ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, 10 సీట్లలోపు వైకాపా పరిమితమైపోతుంది, చంద్రబాబు 2 వ స్థానం లో ఉండబోతున్నారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన్ను 50 వేల ఓట్ల మెజారిటీ తో గెలిపిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *