కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతోన్న సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ ‘అక్క’

(సిరా న్యూస్);

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్. మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోన్న వెర్సటైల్ యాక్టర్స్ కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

‘‘మన చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్, రాధికా ఆప్టే వంటి నటీమణులు ఉండటం అనేది మనకు ఓ బహుమానంగా చెప్పొచ్చు. వారు సహజ సిద్ధమైన నటనతో మెప్పిస్తారు. వారి అద్భుతమైన నటనతో ప్రశంసలను పొంది తద్వారా తమదైన క్రేజ్‌ను వారు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పోటా పోటీగా నటించే వీరిద్దరూ కలిసి ‘అక్క’ అనే స్ట్రీమింగ్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. ఇదే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది’’ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఆదిత్య చోప్రా నిర్మాతగా ధర్మరాజ్ శెట్టి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. ‘అక్క’ ప్రాజెక్ట్‌పై డైరెక్టర్ విజన్‌ని గుర్తించిన ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో ‘అక్క’ సిరీస్‌ను వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీక్రెట్‌గానే ఉంచుతున్నారంటూ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *