సిరా న్యూస్,రాజాం;
నాలుగున్నరేళ్లుగా ఒక మూర్ఖుడు పాలనలో రాష్ట్రప్రజలు నానా అవస్థలు పడుతున్నారని విజయనగరం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు కిమిడి నాగార్జున మండిపడ్డారు. రాజాం శంఖారావం సభలో అయన మాట్లాడారు. సంక్షేమం మాటును పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. రూ.10 ఇచ్చి వందలాగేస్తున్నారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా సొంత చెల్లి మాట్లాడినా సహించలేక సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో స్థానికంగా ఇసుక దొరక్కుండా చేసి పొరుగురాష్ట్రాలకు తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. టిడిపికి చెందిన సీనియర్ నాయకులు అచ్చెన్న, కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర వంటి బిసి నాయకులపై తప్పుడు కేసులు బనాయించారు. జగన్ కు బుద్ధిచెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అవినీతి తిమింగళం, ఓక్స్ వ్యాగన్ వెళ్లిపోవడానికి బొత్స కారణం కాదా? మున్సిపల్ మంత్రిగా ఉన్నపుడు ఆయన రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి శూన్యం. మంత్రి బొత్స నేతృత్వంలో విద్యాశాఖలో కూడా అవినీతి రాజ్యమేలుతోంది, విద్యార్థులకు నాసిరకం కిట్లు ఇస్తున్నారు. టీచర్ల బదిలీల్లో సైతం నిబంధనలను ఉల్లంఘించి భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. మనకు ఒక రాజధాని ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలి. పాలకొండ – రాజాం మధ్య రహదారిని రాష్ట్రంలో ఎక్కడాలేనంత చెత్తగా తయారుచేశారు. చంద్రబాబు అరెస్టయినపుడు పవన్ కళ్యాణ్ వచ్చి సంఘీభావం తెలపడం అభినందనీయం. రాష్ట్రంలో యువతకు నేనున్నానని భరోసా ఇచ్చి లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తే అనేక అడ్డంకులు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన ఎక్కడా తగ్గలేదు, దండయాత్ర మాదిరిగా రాష్ట్రమంతా తిరిగారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు ఇరుపార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలని అన్నారు.