ఏలూరులో బయటపడ్డ ఏ.ఆర్. కానిస్టేబుల్ అక్రమ సంబంధం

భార్యను వదిలి మరో మహిళతో సహజీవనం చేస్తున్న కానిస్టేబుల్
ఆధారం దొరకడంతో పోలీసులకు కానిస్టేబుల్ భార్య, మహిళ భర్త ఫిర్యాదులు
 సిరా న్యూస్,ఏలూరు;
అతనో పోలీస్ కానిస్టేబుల్.. అయితే తన బాధ్యతను మరచి, పోలీస్ కేసుల పేరుతో ఓ వ్యక్తిని బెదిరించి, భార్యకు దూరం చేసి మరీ పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ ఘనుడు.. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జరిగిన వారి అక్రమ సంసారం వారికి ఓ పండంటి బిడ్డ పుట్టడంతో రట్టయింది.
ఏలూరు లోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏ.ఆర్.కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కంభంపాటి కర్ణ కు సునీత అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వట్లూరు కు చెందిన రాజ్యలక్ష్మి అనే వివాహిత తో అతను ఏర్పరచుకున్న అక్రమ సంబంధం రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. రాజ్యలక్ష్మి కి విజయకృష్ణ కు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగి, అబ్బాయి కూడా జన్మించాడు. అయితే, కానిస్టేబుల్ కర్ణ వలలో పడ్డ రాజ్యలక్ష్మి తన భర్త ను, కొడుకును కూడా వదిలేసి కానిస్టేబుల్ తో సహజీవనం చేస్తూ వచ్చింది. ప్రశ్నించిన తమపై కానిస్టేబుల్ కర్ణ తో తమపై అక్రమంగా కేసులు పెట్టి, విడాకులు కూడా ఇవ్వకుండా తన భార్య రాజ్యలక్ష్మి అక్రమ సంసారం చేస్తూ వచ్చిందని బాధిత భర్త విజయకృష్ణ వాపోతున్నారు. ఇప్పుడు తన భార్య వేరే వ్యక్తితో గర్భం దాల్చి, ఏలూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ అయిందని, ఇంతకాలం అక్రమ సంబంధానికి ఆధారాలు లేవని యథేచ్ఛగా ఉన్నవారిపై ఆధారం ఇంతకన్నా ఏమి కావాలని, తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. ఇదిలా ఉంటె, అక్రమ సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ కర్ణ అసలు భార్య సునీత కూడా పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన భర్త తమను వదిలేసి, మరో మహిళతో బిడ్డను కన్నాడని, పోలీస్ అనే దౌర్జన్యంతో తమను బెదిరిస్తున్నాడని, మాకు న్యాయం చేయాలని కోరుతోంది. ఘటనపై ఏలూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *