సిరా న్యూస్ ,కరీంనగర్
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
*ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి
*సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
*ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్న ఆలయ కమిటీ సభ్యులు
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకున్నానని ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా వెలుగొందుతున్న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి స్వయంభు పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్య క్షేత్రంలో షష్టి తిథిన సుబ్రహ్మణ్యశ్వర స్వామికి, స్వయంభు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీశ్రీ గురూజీ ఉమేష్ స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహించారు. నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెట్టుపల్లి, సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్,మంచిర్యాల, కోహెడ, ఎల్కతూర్తి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక హోమం కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం భక్తులకు ధనపాటి నాగేందర్ రెడ్డి రేవతి, సమరసింహారెడ్డి పావనిలు పులిహోరను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మోహన్ రెడ్డి, తెరాల సత్యనారాయణ, తేరాలా అమర్, చొప్పదండి మన తెలంగాణ ఆర్.సి ఇంచార్జ్ నిజానపురం సాగర్ అఖిల, గొల్లపల్లి సదాచారి, సునీల్ కుమార్, ప్రవీణ్ కుమార్, బత్తిని సురేందర్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.