సిరా న్యూస్ ,కరీంనగర్
కొనసాగుతున్న మండల కళాకారుల భజన
*కళాకారులకు ఘన సన్మానం
శ్రీవెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు రేకొండ, చిగురుమామిడి, సుందరగిరి తదితర గ్రామాల కళాకారులు హాజరయ్యారు. గురువారం గత నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్న భజన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కార్యక్రమ నిర్వాహకులు, సాంస్కృతిక శాఖ ఇన్చార్జి సల్వాజీ ప్రవీణ్ చేతుల మీదుగా కళాకారులందరికి స్వామివారి శాలువా ప్రశంస పత్రంతోపాటు శ్రీవెంకటేశ్వర స్వామి వారి మెమోంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో చిగురుమామిడి కళాకారుల కమిటీ మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాధారపు సంపత్, కళాకారులు మొగిలి బొందయ్య, గందె కొమురయ్య, నిలిగొండ కిషన్, దుడ్డేలా రవి, కుతాడి కొమురయ్య ,మోరా వెంకటమల్లు, వర్ణ కుమార్ రెడ్డి, డా.పెనుకుల తిరుపతి, పోరండ్ల సంపత్ రెడ్డి, వెంకటరెడ్డి, రాజయ్య, కొమురయ్య, రాజవ్వ, గూడెం లక్ష్మి, లతాశ్రీ, బాలకృష్ణ, మర్రి సత్తయ్య,జున్నురి లక్ష్మయ్య, దుడ్డెల వెంకటయ్య, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.