Loka Praveen Reddy at Nogoba: నాగోబా ఆలయంలో లోక ప్రవీణ్ రెడ్డి ప్రత్యేక పూజలు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

నాగోబా ఆలయంలో లోక ప్రవీణ్ రెడ్డి ప్రత్యేక పూజలు…

బిజెపి పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ లో గల ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా దేవాలయాన్ని, బిజెపి నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఆలయ కమిటీ సభ్యులు, మెస్రం వంశీయులు సాదర స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సాంప్రదాయ బద్ధంగా ఆయనకు తలపాగా చుట్టి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు సాదర స్వాగతం పలికి, సాంప్రదాయంగా బద్ధంగా తలపాగాతో సత్కరించిన మెస్రం వంశీయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *