సిరా న్యూస్,కాకినాడ;
*భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారని వైఎస్ఆర్సిపి కాకినాడ పార్లమెంటరీ ఇంచార్జ్ చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజవర్గం పర్యటనలో భాగంగా సామర్లకోట వైసీపీ క్యాంప్ కార్యాలయానికి సునీల్ చేరుకోగా నియోజకవర్గ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు, కార్యకర్తలు,నాయకుల తో కలిసి సునీల్ కు ఘన స్వాగతాన్ని పలికారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ మాట్లాడుతూ సుమారు నాలుగు లక్షల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదని ఆయన అన్నారు.కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం లో ఎన్నికల శంఖారావం లో భాగంగా బుధవారం జగ్గంపేట,ప్రత్తిపాడు,తుని నియోజకవర్గం లో పర్యటించడం జరిగిందన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు స్థానాలను వైసిపి పార్టీ గెలువడం జరిగిందని రాన్నున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ వైసిపి గెలవడమే లక్ష్యంగా వాలంటీర్లు, వైసిపి కార్యకర్తలు,నాయకుల కృషి చేయాలని సునీల్ పేర్కొన్నారు. పెద్దాపురం నియోజక వర్గంలో దవులూరి దొరబాబు నేతృత్వంలో వైసిపి పార్టీ పటిష్ఠం గా వుందన్నారు.కాకినాడ పార్లమెంట్ నుండి తనను,పెద్దాపురం నియోజకవర్గం నుండి దొరబాబు ను భారీ మెజార్టీ తో గెలిచేందుకు అందరు కృషి చేయాలన్నారు. అంతకు ముందు వైసిపి క్యాంపు కార్యాలయం లో దొరబాబు నియోజక వర్గ నాయకులను,కార్యకర్తలను సునీల్ కి పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*