మూడో స్థానానికి భారత్ ఆర్ధిక వ్యవస్థ

సిరా న్యూస్;
జపాన్‌ను వెనక్కి నెట్టిన జర్మనీ.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. గత 14 ఏళ్లుగా మూడో స్థానంలో ఉన్న జపాన్..నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్థిక మాంధ్యం ప్రభావానికి లోనవుతున్న జపాన్‌ను వెనక్కి నెట్టి జర్మనీ మూడో స్థానంలో నిలిచింది. తాజా గణాంకాల మేరకు గత సంవత్సరం జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.9 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఏడాది జపాన్ 4.2 ట్రిలియన్ డాలర్ల వాస్తవిక జీడీపీ నమోదు చేసుకోగా.. జర్మనీ 4.4 ట్రినియన్ డాలర్లు నమోదు చేసుకుంది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం జపాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా జపాన్ పోటీతత్వాన్ని, ఉత్పాదకతను కోల్పోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే యెన్‌ విలువ పతనం కావడంతో జపాన్‌ ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే జపాన్ కరెన్సీ 2022లో దాదాపు 20 శాతం క్షీణించగా, 2023లో ఏడు శాతం పడిపోయింది.ఒకప్పుడు అగ్ర రాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛాలెంజ్ చేసిన జపాన్‌.. ఇప్పుడు క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 1990ల నుంచి జపాన్ ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గింది. 2010 నాటి వరకు జపాన్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామణి అయ్యేది. అయితే ఆ దేశాన్ని చైనా వెనక్కి నెట్టి.. రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ పరిణామం జపాన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు జపాన్ మరో స్థానాన్ని కోల్పోయి.. జర్మనీ కంటే దిగువున నాలుగో స్థానానికి పరిమితం అయ్యింది. యూరఫ్ దేశాల్లో జర్మనీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. అయితే జర్మనీ ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.జపాన్, జర్మనీ ఆర్థిక వ్యవస్థలు నేలచూపులు చూస్తుండగా.. భారత్ ఆర్థిక వ్యవస్థ పైపైకి దూసుకుపోతోంది. కొన్నేళ్లలో జర్మనీ, జపాన్‌లను భారత్ వెనక్కే నెట్టి.. మూడో స్థానానికి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ల తర్వాత ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉంది. జర్మనీలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఆర్థిక వృద్ధి నిలిచిపోయింది. జపాన్, జర్మనీ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. సహజ వనరులు తగ్గుతున్నాయి. ఆ రెండు దేశాలు కార్ల ఎగుమతిలో కఠినమైన పోటీని ఎదుర్కొంటున్నారు. IMF డేటా ప్రకారం, భారతదేశం 2026లో జపాన్‌ను, 2027లో జర్మనీని అధిగమించగలదని అంచనా. కానీ జపాన్ , జర్మనీల్లో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారత్ త్వరలోనే ఈ దేశాలను అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఫోర్బ్స్ ప్రకారం, అమెరికా ప్రస్తుతం 27.974 ట్రిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 18.566 ట్రిల్లియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలుస్తోంది. 4.730 ట్రిల్లియన్ డాలర్లతో జర్మనీ మూడో స్థానంలో, 4.291 ట్రిల్లియన్ డాలర్లతో జపాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. భారతదేశం 4.112 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది.బ్రిటన్ జనాభా దాదాపు 7 కోట్లు కాగా, అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు. బ్రిటన్ కంటే భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం పెద్ద విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే సంపద పరంగా భారతదేశం బ్రిటన్ కంటే ఇరవై రెట్లు వెనుకబడి ఉంది.”ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో భారతదేశం బ్రిటన్‌ను అధిగమిస్తుంది. కానీ, ముఖ్యమైన విషయం ప్రజల ఆర్థిక పరిస్థితి. బ్రిటన్ తలసరి ఆదాయం ఇప్పటికీ 45,000 డాలర్లకు పైగానే ఉంది. అదే ఇండియాలో తలసరి ఆదాయం ఏడాదికి కేవలం 2,000 డాలర్లు మాత్రమే” అని సీనియర్ జర్నలిస్ట్, ఆర్థిక విశ్లేషకుడు ఎం.కె. వేణు అన్నారు.రెండు దేశాల ఆర్ధిక వ్యవస్థలను పోల్చాలంటే తలసరి ఆదాయాలను పోల్చి చూడటం సరైన విధానమని వేణు అన్నారు.”ఈ విషయంలో భారతదేశం ఇప్పటికీ యూకే కన్నా చాలా వెనుకబడి ఉంది. తలసరి ఆదాయంలో భారతదేశం చాలా వెనుకబడిన దేశాల జాబితాలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరంగా భారత్ బ్రిటన్‌ను అధిగమించిందని చెప్పడం సరికాదు” అన్నారు వేణు.ఇదే విషయాన్ని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్ధిక వ్యవహారాల నిపుణుడు అరుణ్ కుమార్ కూడా చెప్పారు.”భారత జనాభా బ్రిటన్ జనాభా కంటే ఇరవై రెట్లు ఎక్కువ. మన జీడీపీ వారి జీడీపీతో సమానంగా ఉన్నామంటే, తలసరి ఆదాయంలో మనం 20 రెట్లు వెనకబడి ఉన్నామని అర్ధం. యూకే ఆర్ధిక వ్యవస్థను, భారత ఆర్ధిక వ్యవస్థను పోల్చడం సరికాదు. తలసరి ఆదాయంలో మనం యూకే కన్నా చాలా వెనకబడి ఉన్నాం” అన్నారు ప్రొఫెసర్ అరుణ్ కుమార్.ఇంతకు ముందు మనకు అభివృద్ధి చెందుతున్న లేదా వెనుకబడిన దేశంగానే పేరుంది. కానీ, ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. గత పదేళ్లలో లేదా 1990లలో భారతదేశం తీసుకున్న చర్యలు వాటి ప్రభావాన్ని చూపించాయి. భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయి. 9వ దశకంలో భారతదేశం దగ్గర పరిమిత నిల్వలు మాత్రమే ఉన్నాయి. కానీ, నేడు భారతదేశం అతిపెద్ద విదేశీ మారక నిల్వలున్న నాలుగు దేశాలలో ఒకటి” అని కేడియా అన్నారు.”బ్రిటన్, పశ్చిమ ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుంచించుకుపోతున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పురోగమిస్తోంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, భారతదేశం తన వృద్ధి రేటును కొనసాగించింది” అని కేడియా అన్నారు.”ప్రస్తుతం పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలలో క్షీణత ఉంది. దాని నుండి భారతదేశం కూడా లాభపడింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా పురోగమిస్తోంది. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే నాలుగు-ఐదేళ్ల పాటు వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ, ప్రజల వ్యక్తిగత ఆదాయం పాశ్చాత్య దేశాల స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది” అని వేణు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *