తిరుమలలో ఒకరోజు బ్రహ్మోత్సవాలు

సప్త వాహనాలపై తిరుమల శ్రీవారు
సిరా న్యూస్,తిరుమల;
ఒకరోజు బ్రహ్మోత్సవంకి తిరుమల సిద్దమైంది. రథసప్తమి సందర్భంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఒక్కరోజు తిరుమలలో స్వామి వారు సప్త వాహనాలపై తిరు వీధుల్లో ఈరేగుతారు. లక్షల మంది భక్తులు తిరుమల కి చేరుకోవడం జరిగింది. టీటీడీ సైతం అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, నాలుగు మాడ వీదులను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. భక్తులను ఎంతగానో ఆకట్టుకునే విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో తిరుమల ఆలయం అందంగా అలంకరింప బడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *