సిరా న్యూస్, ఖానాపూర్
సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లిన ఖానాపూర్ ఎమ్మెల్యే
• సానుకూలంగా స్పందించిన సిఎం
రాష్ట్రంలోని ఉద్యోగులు జీవో నంబర్ 317 తో అనేక ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఖానాపూర్ లోని సదర్మట్ కెనాల్ ద్వారా నీటి సమస్యను పరిష్కారించాలన్నారు.అదే విధంగా జీవో నంబర్ 46 దివ్యంగులు, ఉపాధ్యాయుల సమస్యలపై వివరించారు. సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.