సిరా న్యూస్, ఖానాపూర్
సిరిసిల్ల కంటే దీటుగా ఖానాపూర్ అభివృద్ధి చేస్తా
* ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్
* ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి
* 317 జీవోను రద్దు చేయాలి
* ఖానాపూర్ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి.
ఖానాపూర్ నియోజవర్గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించెలా చర్యలు చేపట్టాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లో ఖానాపూర్ నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడారు. ఖానాపూర్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్నారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ చేస్తామని, మాటిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.ఈ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా కడం,పెంబి,దస్తురాబాద్ మండలాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గుడిహత్నూర్ నుండి మొదలుకొని మంచిర్యాల జిల్లా వరకు నాలుగు వరుసల రోడ్డును నిర్మించాలన్నారు. రంగన్నపేట గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలన్నారు.గతంలో కురిసిన చిన్నపాటి వర్షానికి గంగాపూర్ బ్రిడ్జి కూలిపోయిందని, బ్రిడ్జి పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. బ్రీడ్జిను పూర్తి చెయాలన్నారు. అల్లంపల్లి,వాయిపేట,అంకెన రాయదారి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి దిర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఉట్నూరు కేంద్రంలో డి.ఎడ్ కళాశాలను పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన 317 జీవోను రద్దు చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.జీవో నంబర్ 46ను సైతం రద్దు చేయాలన్నారు. కేటీఆర్ మిత్రుడు జాన్సన్ నాయక్ సిరిసిల్ల లాగా మారుస్తా అని ప్రచారం చేశారని కాంగ్రెస్ హయాంలో ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామన్నారు. మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ. ఖానాపూర్ నియోజకవర్గ సమస్యలను పరిష్కారిస్తామన్నారు. త్వరలో అన్ని శాఖలకు ఆదేశాలిస్తామని పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమై రెవెన్యూ డివిజన్ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.