సిరా న్యూస్, పెంబి
భారత్ బంద్ లో భాగంగా కార్మికుల సమ్మె
* బస్టాండ్ ఎదుట కార్మికుల బైఠాయింపు
కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ లో భాగంగా పెంబి మండలం లో శుక్రవారం బస్టాండ్ లో బైఠాయించి కార్మికుల సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు 26000 వేతనం పెంచాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షుడు గోదూరి మల్లేష్, కార్యదర్శి గంగయ్య, కోశాధికారి లింగన్న, రాజన్న, లక్ష్మి, ఆశ వర్కర్ గంగామణి, వినోద, లావణ్య, సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.