సిరా న్యూస్,విజయవాడ;
మాజీఎంపి చింతా మోహన్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలెక్షన్ బాండ్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో మరుపురాని రోజని అన్నారు. లాంగ్ లివ్ సుప్రీం కోర్టు అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేసారు. పార్లమెంటులో మద్దతు ఉందని చట్టాలను, పీపుల్స్ రెప్రజెన్టేటివ్ యాక్ట్, కంపెనీ చట్టాలను బీజేపీ మార్చింది. సుప్రీం కోర్టు జడ్జీలుకు సెల్యూట్ చేస్తున్నాం. ఎలెక్షన్ బాండ్లపై సుప్రీం తీరుపై ప్రధాని మోదీ ఏం సమాధానం చెపుతారు. నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ రాజీనామా చేయాలి. నీళ్ళు మీకు, రాళ్ళు మాకా. అభివృద్ధి రాయలసీమ ప్రాంతానికి అవసరం లేదా. చంద్రబాబు, జగన్ ఇద్దరు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు. ఒకరు అమరావతి మరొకరు విశాఖపట్నం అంటున్నారు. రాష్ట్ర రాజధాని తిరుపతికి రావాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ,ఎస్టీ పేదల అప్పులు మాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టి మా ప్రభుత్వం అధికారంలో రాగానే తొలి సంతకం చేస్తుందని అన్నారు.