సిరా న్యూస్, ఆదిలాబాద్:
కౌఠలో 11 కేవి తీగలు తెగిపడి ఆవు మృతి
+ కన్నీరుమున్నీరైన అన్నదాత
+ నష్టపరిహారం అందించాలని వేడుకోలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కౌఠ గ్రామంలో ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన ఈగం విలాస్ చేన్లో 11కేవీ తీగలు తెగిపడటంతో ఓ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతు, గ్రామస్తుల కథనం ప్రకారం… నుగూర్ గజానన్కు చెందిన ఆవు శుక్రవారం విలాస్ చేన్లో మేతకు వెళ్లింది. మధ్యహ్నం 2గంటల సమయంలో ఒక్కసారిగా 11కేవి విద్యుత్ తీగలు తెగిపడటంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెల్సుకున్న రైతు గజానన్ కన్నీరుమున్నీరయ్యారు. ఆవు విలువ సుమారు రూ. 50వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహరం అందించి ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.