సిరా న్యూస్, ఇచ్చోడ
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
* ఆదిలాబాద్ జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి పవర్ జితేందర్
* ఇచ్చోడలో దేశవ్యాప్త సమ్మె విజయవంతం
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి పవర్ జితేందర్ అన్నారు. శుక్రవారం దేశవ్యాప్త సమ్మె-గ్రామీణ బంద్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విజయవంతమైంది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… కార్మిక చట్టాల పునరుద్ధరణ , కనీస వేతనాల సాధన , స్కీమ్ ల బలోపేతం , రైతన్నల పంటల గిట్టుబాటు ధరల చట్టం , ఉపాధి హామీ పథకం రక్షణ , దేశ సంపదైన ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ , ప్రభుత్వ విద్యా వైద్యం ఉపాధికల్పన అవకాశాల కోసం ఈ పోరాటం జరుగుతుందని అన్నారు. సమస్యలను పరిష్కారం చేయని ఎడల బీజేపీ ప్రభుత్వానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు . కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా హమాలి యూనియన్ అధ్యక్షులు డి సుభాష్ , అంగన్వాడి మండల అధ్యక్షురాలు కామ్రేడ్ గంగమ్మ, ఆశా వర్కర్ మండల అధ్యక్షురాలు కామ్రేడ్ లక్ష్మి అక్క, గ్రామపంచాయతీ అధ్యక్ష కార్యదర్శులు రాజేశ్వర్, అశోక్, భీమ్ బాయి, పోచన్న, రవి తదితరులు పాల్గొన్నారు