సిరా న్యూస్, కళ్యాణదుర్గం
వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
* ఆచారకాపాలనపై తిరుగుబడదాం
* సీఎంగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుందాం
* టిడిపి ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు
వైసిపి ఆచారక పాలన పై ప్రతి ఒక్కరూ తిరుగుబడాలని కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం రూరల్ మండలం పి టి ఆర్ పల్లి తాండ గ్రామంలో బాబు గ్యారెంటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయనకు గ్రామస్తులు, ప్రజలు స్వాగతం పలికారు . అనంతరం గ్రామ ఇంటింటికి తిరుగుతూ టిడిపి కార్యకర్తలు కరపత్రాలు పంచారు. అనంతరం అక్కడ ఏర్పాట్లు చేసి ప్రజా వేదిక ఆయన మాట్లాడారు. నాలుగున్నర ఏళ్ల పాటు పాలనాలో దోపిడీ అక్రమాలు అవినీతి దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి తప్ప , అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందన్నారు. ఏ ప్రాంతంలో చూసినా వైసీపీ ప్రభుత్వం చిదరించుకొని స్థాయికి వెళ్ళింది అంటే పరిపాలన ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది అన్నారు. అందుకోసమే మనమందరం సమీష్టంగా పోరాటం చేస్తూ వైసిపి ప్రభుత్వం ఆచార కాపాలనపై చార్మా గీతం పడి టిడిపి విజయానికి కృషి చేస్తూ సీఎంగా చంద్రబాబు నాయుడు గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు