ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్
సిరా న్యూస్,నర్సారావుపేట;
నరసరావుపేట పల్నాడు బస్టాండు వద్ద వైయస్సార్సీపి పార్టీ పార్లమెంట్ కార్యాలయాన్ని పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గోన్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నరసరావుపేట లాంటి మంచి ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా పంపించిన ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ్యులందరినీ కలుపుకొని పోతానని, ప్రజలందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఎక్కువ మందిని కలిసి అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని అన్నారు….