సిరా న్యూస్,మానకొండూరు;
శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఎల్లిపాయలను దొంగిలించో దొంగ. నాలుగు నెలలు కష్టపడి పండించిన పంట దొంగల పాలవడంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో రైతు గుండవేని తనకుండే భూమిలో ఎల్లిపాయలను సాగు చేశాడు నలభై వేలు పెట్టుబడి పెట్టాడు. నాలుగు నెలలు కష్టపడి సాగు చేసారు. ట్టి ఈ సారి ఎల్లిపాయలకు అధిక ధరలు ఉండడం తో లాభం అధికం గా వస్తుందని ఆశించాడు. ఇంతలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఎల్లిపాయ మడిని తవ్వుకొని తీసుకుపోయారు. శంకర్ పొలం దగ్గరికి వెళ్లేసరికి వెల్లిపాయ కాడా లు చిందర వందరగా ఉండడం చూసి లబోదిబోమన్నాడు. దొంగలను త్వరగా పట్టుకోవాలని పోలీసులుకు పిర్యాదు చేసాడు.