సిరా న్యూస్, కుందుర్పి
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి
* ఎస్సీ కాలనీ సౌత్ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ వరలక్ష్మీ నాగేంద్ర
* అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని ఎస్సీ కాలనీ సౌత్ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ వరలక్ష్మీ నాగేంద్ర అన్నారు. శనివారం కుందుర్పి మండల కేంద్రం లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎస్సీ కాలనీ సౌత్ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ వరలక్ష్మీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో విద్యార్థులచే సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్సీ కాలనీ ఫాదర్ ఫెర్రర్ ఆలయ ప్రదేశంలో ఏర్పాటుచేసిన స్టేజ్ పై ముందుగా దేవుళ్ళ చిత్రపటాలకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలను ప్రారంభించారు. ( సౌత్ స్కూల్ ) పాఠశాల విద్యార్థులు చేసినటువంటి నృత్యాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా కాలనీ యువకులు మాట్లాడుతూ….పాఠశాల విద్యార్థులను, ఎస్సీ కాలనీ యువకులను చదువులో అయితేనేమి, ఆటల పోటీలు, సంస్కృతిక కార్యక్రమాల్లో అన్నిటిలో ఎస్సీ కాలనీ సౌత్ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ వరలక్ష్మి నాగేంద్ర వెన్నుతట్టి మమ్ములను ప్రోత్సహిస్తున్నారన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూన్నామని చెప్పారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించి మొక్కను బ హూకరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్సీ కాలనీ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.