వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు రూ. లక్ష చొప్పున ప్రమాద బీమా పత్రాలను అందజేత
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు రూ. లక్ష చొప్పున ప్రమాద బీమా పత్రాలను కేటీఆర్ అందజేశారు. వికలాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. 70 కిలోల కేక్ కటింగ్ చేశారు.కేసీఆర్ జన్మదిన వేడుకలకు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. కేసీఆర్ రాజకీయ, ఉద్యమ నేపథ్యంతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.