సిరా న్యూస్, చిగురుమామిడి
కరీంనగర్ జిల్లా చిగురుమామి మండలంలో స్నేహితుని జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ పంపిణీచేశారు.
తమ చిన్ననాటి స్నేహితుడు తమతో పాటు 10 సంవత్సరాలు కలిసి చదువుకొని అకాల మృతిచెందిన స్నేహితుని జ్ఞాపకార్థం మెటీరియల్ పంపిణీ చేశారు. నవాబుపేట గ్రామానికి చెందిన బోయిని అజయ్ ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. కాగా ఆదివారం అజయ్ జన్మదినం జ్ఞాపకార్థంగా అతని చిన్ననాటి మిత్రులు నవాబుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు పలకలు, పరీక్షా ప్యాడ్స్ తోపాటు పరీక్షా సామగ్రి ని విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం అజయ్ స్నేహితులు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో అజయ్ పేరిట సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ సిబ్బంది, అజయ్ స్నేహితులు, బంధువులు, విద్యార్థులు పాల్గొన్నారు.