సిరా న్యూస్, బేల:
అదిలాబాద్ జిల్లా ఆదిమ గిరిజన, కొలాం సేవ సంఘం నూతన కమిటీ ఎన్నిక…
అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల-కే గ్రామంలో, ఆదిమ గిరిజన, కొలాం సేవ సంఘం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండలంలోని మసాల-కే గ్రామంలో కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, భీంపూర్ , నార్నూర్, సిరికొండ, గాదిగూడ, ఉట్నూర్ మండలాల నుండి తరలివచ్చిన మేధావులు, ఉద్యోగులు, యువకులు, ప్రజాప్రతినిధులు, కుల పెద్దలు ఎన్నికల్లో పాల్గొని జిల్లా నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా మడావి గోవింద్ రావ్, గౌరవ అధ్యక్షులుగా కొడప జంగు, ఉపాధ్యక్షులుగా మడవి లచ్చు, టెకం భీమ్ రావ్, జనరల్ సెక్రటరీ గా లక్ష్మణ్, కోశాధికారి గా సిడం నగేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు సంఘం సభ్యులు, గ్రామస్తులు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మడావి గోవింద్ రావ్ మాట్లాడుతూ… కొలం సంఘం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు.