విశాఖకు ఎప్పుడు నాన్ లోకలేనా….

 సిరా న్యూస్,విశాఖపట్టణం;
ఏపీలో విశాఖ పార్లమెంట్ స్థానం కీలకం. కానీ స్థానికేతరులే అక్కడ ఎంపీగాఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా స్థానికేతరులేఅభ్యర్థులుగా ఉన్నారు. టిడిపి నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, వైసిపినుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేయడం దాదాపు ఖాయంగా తేలింది. ఒకవేళపొత్తులు భాగంగా బిజెపికి సీటు ఇచ్చినా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుపురందేశ్వరి బరిలో దిగే అవకాశం ఉంది. అయితే ఆమె సైతం స్థానికేతురాలుకావడం విశేషం.ఇటీవల విశాఖలో కొన్ని సంఘాలు స్థానిక అంశం తెరపైకితెచ్చినా.. రాజకీయ పార్టీలు లైట్ తీసుకున్నాయి. స్థానికేతురులకేటిక్కెట్లు కట్టబెట్టాయి.విశాఖ ఎంపీగా బాట్టం శ్రీరామమూర్తి చివరి లోకల్ కాండేట్ గా నిలిచిపోయారు. అటు తరువాత స్థానికేతురులే ఎంపీలుగా పోటీచేయడం, ప్రాతినిధ్యం వహించడం ఆనవాయితీగా వస్తోంది. కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి, ఎంవివిఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి,పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు, ప్రస్తుత సిట్టింగ్ ఎంపి ఎంవివిసత్యనారాయణ.. ఇలా అందరూ స్థానికేతరులే. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు.అయితేవిశాఖ ఎంపీగా ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారి ప్రాతినిధ్యం వహించడంవిశేషం. ఎంవివిఎస్ మూర్తి, కంభంపాటి హరిబాబు, పురందేశ్వరి, సిట్టింగ్ఎంపీ సత్యనారాయణ.. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. రెడ్డిసామాజిక వర్గానికి చెందిన నేదురు మల్లి జనార్దన్ రెడ్డి,సుబ్బిరామిరెడ్డిలు సైతం ఎంపీలుగా ఎన్నికయ్యారు.

అయితే వైసిపి విజయనగరంజిల్లాకు చెందిన బొత్స ఝాన్సీ లక్ష్మి అనూహ్యంగా ఎంపిక చేసింది. ఆమెనుస్థానికురాలుగా ప్రమోట్ చేస్తోంది. అటు టిడిపి నుంచి వచ్చిన భరత్ నుమాత్రం స్థానికేతరుడుగా చిత్రీకరిస్తోంది. అయితే ఆమె విజయనగరం ఎంపీగా,జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అటువంటి ఆమె విశాఖకు లోకల్ఎలా అవుతారని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.భరత్ గీతం విద్యాసంస్థలఅధినేత. మాజీ ఎంపీ ఎంవివి ఎస్ సత్యనారాయణ మనుమడు. ఈ కుటుంబం గత ఐదుదశాబ్దాలుగా విశాఖలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. రాజమండ్రి నుంచివలస వచ్చింది. ఇక్కడే ఉంటూ వస్తున్న భరత్ ఎలా స్థానికేతరుడు అవుతాడనిటిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కానీ వైసిపి ఒక వ్యూహాత్మకంగాముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు అవకాశంఇచ్చారని.. ఈసారి మాత్రం కాపులకు ప్రాధాన్యం ఇచ్చి ఓట్లు వేయాలని ప్రజలనుకోరుతోంది. అయితే 2014లో సైతం వైఎస్ విజయమ్మ వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు. కడప నుంచి దిగుమతి చేసుకున్నారని.. విశాఖలో రాయలసీమ సంస్కృతిపెరుగుతుందని టిడిపి నేతలు ప్రచారం చేశారు. దీంతో విజయమ్మకు ఓటమితప్పలేదు. ఇప్పుడు బొత్స ఝాన్సీ లక్ష్మీ విషయంలో కూడా అదే తరహా ప్రచారంసాగుతోంది. బొత్స హవా విశాఖలో పెరుగుతుందని సొంత పార్టీ శ్రేణులే ఆందోళనచెందుతున్నాయి. ఈ తరుణంలో ఝాన్సీ లక్ష్మీ గెలుపు పై అనుమానాలు ఉన్నాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *