Is Jagan encouraging violence in elections? : జగన్ ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నారా…

సిరా న్యూస్,తిరుపతి;

వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ రెండో సారి గెలిచేందుకు ఎన్నికల ప్రచారవ్యూహం భిన్నంగా ఉంది. సిద్ధం అనే పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించియుద్ధానికి సిద్ధం కావాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. చొక్కాలు మడతపెట్టే సమయం వచ్చిందని .. మీరే నా సైన్యమని వాలంటీర్ల సభలోవ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న పిలుపులు.. ఆయన ప్రచారవ్యూహం చూస్తూంటే.. ఎన్నికల యుద్ధం పేరుతో క్యాడర్ ను రెచ్చగొడుతన్నారని.. హింసాత్మక ఎన్నికలకు ప్రిపేర్ చేస్తున్నారన్నవిమర్శలు విపక్షాల నుంచి అంతకంతకూ పెరుగుతున్నాయి. దానికి తగ్గ పరిణామాలుఒకటొకరిగా వెలుగులోకి వస్తూండటంతో.. వైసీపీ వ్యూహం భయపెట్టి ఎన్నిక్లోలగెలవడం అనేనని.. మీరు చొక్కాలు మడతేస్తే మేం కుర్చీ మడతపెడతామనివిపక్షాలు అంటున్నాయి. సాధారణంగా అధికారంలో ఉండే పార్టీ యుద్ధానికి
వెళ్తున్నట్లుగా ఎన్నికలకు వెళ్లదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీరెండు పార్టీల మధ్య జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ.. అసలు విజేతలుప్రజలే. ప్రజలు ఎవరు కావాలనుకుంటే వారిని గెలిపిస్తారు. అధికారంలో ఉన్నపార్టీ తమ పాలనపై ప్రజాతీర్పు ఇవ్వాలని వెళ్తుంది. అదే దిశగా ప్రచారంచేస్తుంది.

కానీ వైఎస్ఆర్సీపీ అసలు విషయం కన్నా యుద్ధానికిసిద్ధమన్నట్లుగా ప్రచారం చేస్తోంది. కూటమిగా కట్టి మిగిలిన పార్టీలన్నీవస్తున్నాయని.. మిమ్మల్ని నమ్ముకుని ఒక్కడిగా ఉన్నానని జగన్ మోహన్ రెడ్డిసభల్లో చెబుతున్నారు. తనకు రక్షణగా ఉండాలంటున్నారు. తన కోసం యుద్ధంచేయాలంటున్నారు. క్యాడర్ తో ఏర్పాటు చేసిన సిద్ధం సభల్లో.. అవేచెబుతున్నారు. వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సభలో మరో అడుగు ముందుకేశారు.చొక్కాలు మడత పెట్టాలని పిలుపునిచ్చారు. అంటే దాడులు చేయడానికి కూడాసిద్ధపడాలన్న అర్థం అందులో ఉందని ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది.ఎన్నికల యుద్ధంలో చొక్కాలు మడత పెట్టాలనడంపై విపక్షాల నుంచి విమర్శలువస్తున్నాయి. అయినా ఈ డోస్ ను సీఎం జగన్ పెంచుకుంటూ వెళ్లే అవకాశాలుఉన్నాయి. సీఎం జగన్ ప్రకటనలు, హింసాత్మక ఎన్నికల అంశంపై చర్చ జరుగుతున్నసమయంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటెక్కలిలో స్థానిక ఎన్నికలు నిర్వహించిన తీరును వివరిస్తూ.. ఓ ఆడియో టేప్వెలుగులోకి వచ్చింది.
ఎమ్మెల్సీ తాము ఏ విదంగా పంచాయతీ ఎన్నికలు గెలిచామోవివరించారు. వ్యూహాత్మకంగా అచ్చెన్నాయుడు స్వగ్రామంలో దాడులు చేసి..రివర్స్ లో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి..నియోజకవర్గం అంతా భయానక వాతవరణం ఏర్పాటు చేశారు.

తర్వాత టీడీపీజడ్పీటీసీ అభ్యర్థులపై రౌఢీషీట్లు ఓపెన్ చేసి.. ఇంట్లో నిర్బంధించిఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకున్నారు. ఫలితంగా 55 పంచాయతీలే వస్తాయనితేలిన చోట… ఓ పది ఇరవై తప్ప అన్ని పంచాయతీలను.. జడ్పీటీసీలనుగెల్చుకున్నారు. అంటే భయపెట్టి.. పోలీసుల్ని దుర్వినియోగం చేసి ఎన్నికలునిర్వహించారు. ఈ ఆడియో టేప్ వైరల్ అయింది. అందులో ఒక్క శాతం కూడా అబద్ధం
లేదని.. టెక్కరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరును చూసిన ఎవరికైనాఅర్థమవుతుంది. ఇదే వ్యూహాన్ని స్థానిక ఎన్నికల్లో రాష్ట్రమంతా పాటించారు.వచ్చే ఎన్నికలు చాలా హింసాత్మకంగా ఉంటాయని చాలా మంది రెండేళ్లుగా అంచనావేస్తున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఏపీలోపోలీసు వ్యవస్థ పని తీరుపై ఎన్ని విమర్శలు వచ్చాయో లెక్కలేదు. చివరికితిరుపతి ఉపఎన్నికలు నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికిఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించడంతో అన్ని వివరాలు బయటకు వచ్చాయి.కొన్ని వేల నకిలీ ఓట్లతో ఎన్నికలు నిర్వహించారు. అధికార పార్టీ, నేతలుప్రోద్భలంతో జరిగినవే ఇవన్నీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏకపక్షంగా గెలిచే చోట కూడా ఇంత భారీగా అక్రమాలకు పాల్పడటం అంటే.. చిన్నవిషయం కాదని.. లోతైన కుట్ర ఉందన్న అనుమానాలు విపక్ష నేతలు వ్యక్తంచేస్తున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగామారింది. వైసీపీ నేతలు ఎన్ని చట్టాలు ఉల్లంఘించినా చూసీ చూడనట్లుగాఉంటున్నారు. కానీ.. టీడీపీ సహా విపక్షాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *