సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ సిటీ బస్సుల్లో సీటింగ్ పద్ధతి మారింది. హైదరాబాద్ మెట్రోట్రైన్ తరహాలో బస్సుల్లోనూ సీటింగ్ మార్చారు. మహాలక్ష్మి పథకం అమలుతోహైదరాబాద్ సిటీ బస్సుల్లో రద్దీ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునిసీటింగ్ లో పలు మార్పులు చేశారు అధికారులు. ఉదయం సాయంత్రం వేళల్లో సిటీబస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లు ఉంటేఎక్కువమంది ప్రయాణించడానికి వీలు ఉంటం లేదని గ్రేటర్ హైదరాబాద్ జోన్ లోప్రయోగాత్మకంగా బస్సుల్లో సీటింగ్ మార్చారు. మెట్రో ట్రైన్ తరహాలోఆర్టీసీ సిటీ బస్సుల్లో సీటింగ్ మార్చేశారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకుఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి బస్సుల్లో విపరీతమైనరద్దీ ఉంటోంది. దీంతో టీఎస్ ఆర్టీసీ వినూత్న నిర్ణయం తీసుకుంది. మెట్రోరైలులో సీట్ల మాదిరి బస్సుల్లోనూ సీటింగ్ మార్చేస్తోంది. సైడ్లకు సీట్లనుఏర్పాటు చేయడం ద్వారా మధ్యలో ఎక్కువమంది నిల్చోవచ్చని భావిస్తోంది. ఈసీటింగ్ మార్పు ద్వారా ఒక్కో బస్సులో సాధారణం కంటే మరో 25మందిప్రయాణించవచ్చని అధికారులు అంచనా వేశారు.