సిరా న్యూస్,అన్నమయ్య;
పీలేరులొ జర్నలిస్టులపై దాడులను ముక్తకంఠంతో ఖండించాలని పీలేరు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కోరారు. రాప్తాడులో ఫోటోగ్రాఫర్ కృష్ణ పై జరిగిన దాడికి నిరసనగా పీలేరు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ఆందోళన చేపట్టారు. మానవహారం నిర్వహించి తమ నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు.