సిరా న్యూస్,కడప;’
మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 99 శాతం నెరవేర్చానని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం పచ్చి అబద్దమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. జగన్, అబద్ధాలు కవల పిల్లలు. ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద రూ.12.500లు ఇస్తానని మేనిఫెస్టోలో పేర్కొని అందులో రూ.5 వేలు కోత. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన అమలు కావడం లేదని అన్నారు.
పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి,25 వేల ఇళ్లు కూడా నిర్మించ లేదు. జలయజ్ఞం కింద ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేరలేదు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని మహిళలకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. కరేంట్ చార్జీలు పెంచమని చెప్పి ఎనిమిది సార్లు పెంచారు. పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజల్ ధరలు తగ్గిస్తామని చెప్పి పెంచారు. 2019 ఎన్నికల అఫడవిట్ ప్రకారం దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడు జగన్.. నాటికి ఆయన ఆస్థివిలువ రూ. 510 కోట్లు. అయినా పే దవాడినని చెప్పుకోవడం విడ్డూరం. ఇకనైనా పచ్చి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని అన్నారు.