కొత్త నాటకానికి తెర తీసిన మంత్రి జోగి రమేష్

టీడీపీ నేత బోడె ప్రసాద్
 సిరా న్యూస్,పెనమలూరు;
ఎన్నికల సమయంలో టీడ్కో ఇండ్ల పంపిణీ అంటూ జోగి రమేష్ కొత్త నాటకానికి తెరదీస్తున్నాడని పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ధ్వజమెత్తారు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో గల టిడ్కో ఇండ్ల దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నగర పంచాయతీ మాజీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాధరావు ఉయ్యూరు రూరల్ అధ్యక్షుడు వెనిగండ్ల కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో 70 శాతం పూర్తయిన టిట్కో ఇండ్లను పూర్తి చేయలేని అసమర్ధకు మంత్రి అంటూ నినదించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం హయాంలో పేదవాడి సొంత ఇంటి కల నిజం చేసే లక్ష్యంతో అన్ని సౌకర్యాలతో కూడిన టిట్కో ఇండ్లు 70% వరకు పూర్తి చేశామని తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఈ ఇండ్లను పూర్తిగా విస్మరించి పాడు పెట్టిందని, ఐదు సంవత్సరాలు మొద్దు నిద్రపోయిన ప్రభుత్వం ఇప్పుడు మరలా ప్లాట్లు కేటాయిస్తామంటూ కొత్త నాటకానికి తెర తీసింది అన్నారు. పెనమలూరు సమన్వయకర్తగా వచ్చిన జోగి రమేష్ గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉండి ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలోని టిడ్కో ఇండ్లను పూర్తి చేయలేకపోయాడని, ఇటువంటి అసమర్ధ మంత్రి మాటలను పెనమలూరు ప్రజలు విశ్వసించరని అన్నారు. ఆసరా పేరుతో సభలు నిర్వహించి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బోడె ప్రసాద్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సుందరీకరించి అన్ని హంగులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *