కొణతాలలో పవన్ భేటీ

 సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో మాజీ మంత్రి, జనసేన నేత కొణ తాల రామకృష్ణ తో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కొణతాల నివాసంలో గంటకు పైగా పవన్ ఈ సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ భేటీపై మీడియా కు పవన్ పలు కీలక విషయాలను వెల్ల డించారు. ఎన్నికలు, ఉత్తరాంధ్ర సమ స్యలపైన కులంకుషంగా మాట్లాడుకు న్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. కొణ తాలతో సమావేశం మర్యాద పూర్వకమేనని పవన్ తెలిపారు. అనంతరం కొణతాల రామకృష్ణ మాట్లా డుతూ… పవన్ కళ్యాణ్ను ఉత్తరాంధ్రను దత్తత తీసు కోమని కోరానని చెప్పానని అన్నారు. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలో సూచించానని తెలిపారు. సమ యం వచ్చినప్పుడు ఆ వివరాలు చెబుతానని అన్నా రు. పంచాయితీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు భాగస్వామ్య పక్షాలు అవగాహనతో వెళ్లలనేది తమ ఆలోచన అని తెలిపారు. జనసేన నేత నాగబాబు పోటీ, ఆయన పర్యటనలకు దూరంగా ఉంటున్నా మనేది ఊహాజనితమేనని… అసలు కారణాలు వేరే ఉన్నాయని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *