పాల్గోన్న యాంకర్ అనసుయ
సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగా రెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ RCI రోడ్డులో సామల పాపి రెడ్డి గార్డెన్ లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సినీ నటి యాంకర్ అనసూయ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు యాక్టర్ ఆకాష్ పూరి, సామల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అనసూయ తెలిపారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అనసూయ సూచించారు. దేవుని మనో ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటానని అనసూయ తెలిపారు. దేవుని పూజా కార్యక్రమం లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మూడు రోజులపాటు వివిధ హోమాలు,పూజా కార్యక్రమాలు నిర్వహించారు.