-సిపిఎస్ రద్దు ఉద్యమానికి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం మద్దతు
ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మంద బాబ్జి
సిరా న్యూస్,నెల్లూరు;
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఆత్మ పరిశీలన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మంద బాబ్జి పేర్కొన్నారు.డి ఎ బకాయిలను వెంటనే చెల్లించాలి.ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా.పలు సందర్భాలలో ఉద్యోగులకు ఇచ్చిన పలు హామీలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మందా బాబ్జి కోరారు. నెల్లూరులో జరిగిన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మంద బాబ్జి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మందా బాబ్జి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయాలని కోరుతున్న సిపిఎస్ ఉద్యోగులు ” చలో విజయవాడ ” కార్యక్రమాన్ని అణచివేత ధోరణి ఆలంబించడం,సిపిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ధనరాజుని, సిపిఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు దేవానంద్ గారిని మరియు రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షులు కి నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సబబన్ని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మంద బాబ్జి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు తమ న్యాయమైన కోరికల గురించి నిరసనలు తెలిపితే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన చరిత్ర లేదని బాబ్జి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలను బలహీనపరచడం, ఉద్యోగులపై కక్షపూరిత వైఖరి, అణచివేత ధోరణి లాంటి అంశాలు ప్రభుత్వంపై ఉద్యోగులు అసంతృప్తికి ఒక ప్రధాన కారణమని తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు అంశంలో ఏపీ జాయింట్ కౌన్సిల్ సభ్యత్వం గల ఉద్యోగ సంఘాలు ఏకత్రాటిపై రావాలని కోరారు. ప్రధాన సంఘాలు సంక్లిష్టమైన సమయంలో తమ స్వార్ధ ప్రయోజనాలు మరియు ప్రభుత్వం మెప్పుకోసం సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే ఉద్యోగుల ఉద్యమాల చరిత్రలో సంఘ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి నిర్వహించే ఉద్యోగ సంఘాల సమావేశాలు కేవలం చాయ్ బిస్కెట్లు మరియు మంత్రులు, అధికారులతో సంఘ నేతల ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులపై అణచివేత ధోరణి విడనాడి వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, తక్షణమే సిపిఎస్ రద్దు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మందా బాబ్జి డిమాండ్ చేశారు.మరియు ఉద్యోగులకు సకాలంలో అందవలసిన బకాయిలు ఐ ఆర్ మరియు పిఆర్సి మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు మందా బాబ్జి, ఉపాధ్యక్షులుకొమ్మల కృష్ణయ్య రాపూరు రమణయ్య, సంయుక్త కార్యదర్శి కూల్లూరి ప్రభాకర్, కార్యదర్శి పాలకీర్తి శ్రీనివాసులు, అరవ శౌరి తదితరులు పాల్గొన్నారు.
======================