సిరాన్యూస్, దస్తూరాబాద్
ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ
దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం సోమవారం శివాజీ యువసేన ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్బంగా శివాజీ చేసిన పోరాటాలు స్మరించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శివాజీ యువసేన ముఖ్య సభ్యులు , గ్రామ యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.