సిరా న్యూస్,ఒంగోలు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురేదురుగా వస్తున్న కారు,ఆటో ఢీకొన్నాయి, దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఇద్దరు ఆటోలో సజీవ దహనం అయ్యారు.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. మృతులు బెస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు,చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు