సిరా న్యూస్,మచిలీపట్నం
మచిలీపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసికొంది. మచిలీపట్నం సాయి బాబా గుడి సమీపంలో ప్రధాన రహదారి పై సైకిల్ పై వెళుతున్న తాపీ కూలీ ఎం ఆంజనేయులు బస్సు వెనక టైర్ల కింద పడి తీవ్రం గా గాయపడ్డాడు. 108 రావడం ఆలస్యం కావడం తో స్థానికులు ఆటోలో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆంజనేయులు అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. 108 సకాలంలో వచ్చుంటే..ప్రాణాలతో బతికేవాడని స్థానికుల అంటున్నారు.