సిరా న్యూస్,నిర్మల్;
భైంసా-నిర్మల్ జాతీయ రహదారి పై మంగళవారం రైతులు ధర్నా, రాస్తా రోకో చేపట్టారు. భైంసా మండలం ఖడ్గం గ్రామస్తులు గత 24 గంటలుగా కరెంట్ లేక తమ పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. దీంతో రహదారికి ఇరు వైపులా కిలో మీటరు వాహనాలు నిలిచిపోయాయి. అధికారులకు ఫోన్ చేస్తే మీకు ఇష్టం వచ్చింది చేసుకోమన్నరని ఆరోపించారు. విద్యుత్ అధికారులు వెంటనే క్షమాపణ చెప్పి వెంటనే విద్యుత్ పునారుదడ్డించాలని డిమాండ్ చేశారు.