సిరా న్యూస్,నెల్లూరు;
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో జరిగిన భారీ అవినీతి కుంభకోణాన్ని బయట పెట్టారు.373 టీడీఆర్ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారి తాసిల్దార్ సహా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ ఆరోపించారు. సంవత్సరం క్రితం 10 వేల రూపాయల విలువ చేసే భూమిని 1 లక్ష 60 వేల రూపాయలు విలువను పెంచుతూ అధికారులు చేసినటువంటి గోల్మాల్ కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది అన్నారు. మీడియా ప్రతినిధులపై వైసీపీ దాడి పై ఆనం స్పందించారు. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని లపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.