సిరా న్యూస్, జైనథ్:
ఎంపీడీవో రవీంద్రనాథ్ ను సన్మానించిన ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల ప్రజా పరిషత్తు నూతన ఎంపీడీవో రవీంద్రనాథ్ ను, ఎంపీపీ మర్శెట్టి గోవర్ధన్ సన్మానించారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో భాగంగా జైనథ్ కు వచ్చిన ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవోకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, మండల పంచాయితీ అధికారి దిలీప్, కార్యాలయ సూపరింటెండెంట్ ముత్యం రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.