సిరా న్యూస్, బైంసా
దేశాన్ని సమూలంగా నాశనం చేసింది కాంగ్రెస్
* ఆదిలాబాద్ ఎంఎల్ఏ పాయల్ శంకర్
* ప్రారంభమైన విజయ సంకల్పయాత్ర
70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సమూలంగా నాశనం చేసిందని ఆదిలాబాద్ ఎంఎల్ఏ పాయల్ శంకర్ అన్నారు.
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయ సంకల్పయాత్ర మంగళవారం నిర్మల్ జిల్లా బైంసాలో అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ ప్రారంభించారు. వారికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. బైంసా నుండి ప్రారంభమైన ఈ విజయ సంకల్ప యాత్ర మంగళవారం నిర్మల్ వరకు కొనసాగుతుందన్నారు.కేవలం 10 సంవత్సరాలలో అట్టడుగు స్థాయి నుంచి ప్రపంచపు అత్యున్నత శిఖరాలకు దేశ కీర్తిని తీసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అని అన్నారు. దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో దేశ పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి ప్రస్తుతం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది అన్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు