మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా బాబ్జి విగ్రహవిష్కరణ కార్యక్రమం…..

పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభిమానులు

-విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని-బాబ్జి కుమార్తె శ్రావణి…
-కుల మతాలకతీతుడైన బాబ్జి అందరివాడు
– ఎమ్మెల్యే కొడాలి నాని
 సిరా న్యూస్,గుడివాడ;
గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా వెంకటరమణ (బాబ్జి) విగ్రహవిష్కరణ కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి.గుడివాడ ఎజికే స్కూల్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహం పక్కన బాబ్జి సేన మరియు అభిమానులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని బాబ్జి కుమార్తె శ్రావణి,ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించి జోహార్ అడపా బాబ్జి అంటూ నినాదాలు చేశారు.ముందుగా వంగవీటి మోహనరంగా విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని, అడపా శ్రావణి, బాబ్జి అభిమానులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిమానులద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. చిన్న వయసులోనే మనకు దూరమైన బాబ్జి, విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సి రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన శక్తికి మించి పేదలకు సేవలు అందించే బాధ్యత లేని లోటు,నిర్భాగ్యులకు కూడా తీరనిలోటన్నారు.2019 ఎన్నికల్లో తన గెలుపు కోసం మండుటెండల్లో 60 రోజులుగా నిరంతరం ప్రచారం చేసిన బాబ్జి తన ముక వర్చస్సును కూడా కోల్పోయారని ఎమ్మెల్యే నాని అన్నారు .వైసీపీలో గెలిచి పార్టీ మారిన కొందరు ద్రోహులు, అప్పటి 420 చైర్మన్, బాబ్జిను వైస్ చైర్మన్ గా దింపేందుకు కుట్రలు పన్నిన విషయాలను ఎమ్మెల్యే నాని తెలియజేశారు. మృదుస్వభావి అయిన బాబ్జి తన పదవి పోయిన పర్వాలేదని తనతో అన్నారని, పదవి ముఖ్యం కాదు మనల్ని దింపాలనుకునే 420గాడి ఖండకావరాన్ని అణిచివేయాలని నాడు తాను బాబ్జికి ధైర్యం చెప్పానని నాటి రోజులను ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తు చేసుకున్నారు. బాబ్జి మంచితనానికి 11 మంది టీడీపీ కౌన్సిలర్లు సహకరించడంతో, తన వెనకాల సీఎం చంద్రబాబు ఉన్నాడన్న 420 చైర్మన్ కాళ్ల బె బేరానికి వచ్చాడని కొడాలి నాని అన్నారు. బాబ్జి లేని లోటు ఎప్పటికి తీర్చలేనిదని, ఆయన చూపిన మార్గంలో తామంతా పయనిస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. బాబ్జి అన్న భౌతికంగా మా మధ్య లేకపోయినా చిరస్థాయిగా అభిమానుల హృదయాల్లో నిలిచి ఉంటారని, బ్రతికి ఉన్న రోజుల్లో ఆయన చెప్పిన మాటలు పాటిస్తూ ఆయన చూపిన మార్గంలోనే తామంతా పయనిస్తామని బాబ్జి సేన వ్యవస్థాపకుడు అద్దేపల్లి పురుషోత్తం అన్నారు.బాబ్జి విగ్రహావిష్కరణ వేడుకల్లోచైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్,పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను,ఎంపీపీ పెయ్యల అదాం,యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, గులిపల్లి శ్రీను,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంవి. నారాయణరెడ్డి,నాయకులు పాలేటి చంటి, అడపా పండు,మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నిలాకంత్,పార్టీ నాయకులు వీరిశెట్టి నరసింహారావు, పంచకర్ల వెంకట్, వడ్లాని సుధాకర్, జోగా సూర్యప్రకాష్, అడబాల అప్పారావు,గిరి బాబాయ్, చుండూరి శేఖర్, కోంకితల ఆంజనేయ ప్రసాద్, కలపాల కిరణ్ ,దోమ రఘు,అద్దేపల్లి హరి ప్రసాద్,వెంపల అప్పారావు, యార్లగడ్డ మురళి, మళ్లీపూడి శ్రీనివాస చక్రవర్తి, గోవాడ చంటి, ఆర్కె, సింహాద్రి రాంబాబు, ధనాల ఫణి, మూడేడ్ల ఉమా, గుడివాడ బీసీ సంఘం అధ్యక్షుడు దారం నరసింహారావు,రావులకోల్లు నాగమల్లేశ్వరరావు, అలంకార్ శేఖర్,జ్యోతుల మణికంఠ,తోట నాగరాజు, నేరుసు శేషగిరి,షేక్ సయ్యద్,తోట రాజేష్,మాదాసు వెంకటలక్ష్మి,కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి,తాళ్లూరి ప్రశాంత్,పిల్లి బెన్ని,మొండ్రు వెంకటేశ్వరరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ నగుళ్ల సత్యనారాయణ, దుడ్డు చిన్నా,చిన నారాయణ రెడ్డి,కోలుసు నరేంద్ర, వెంపటి సైమన్, జ్యోతుల సత్యవేణి,బాబ్జి సేన సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *