సిరా న్యూస్, భీంపూర్
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి
* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా భీంపుర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో గల శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అలవేలు మంగా సమేత శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి నవమ బ్రహ్మొత్సవ నిర్వహించారు. ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు,ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువా కప్పి సత్కరించారు.