గద్దెల ప్రాంగణం

సిరా న్యూస్;

కోట్లాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి మేడారంకి వచ్చి సమ్మక్క, సారాలమ్మా తల్లుల దర్శనానికి బారులు తీరారు. భక్త జనం ఎదురు చూస్తున్న ఘడియ రానే వచ్చింది గురువారం చిలకలగుట్ట నుండి సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెక్క నుంది.
సల్లని తల్లి సమ్మక్క రాక కు అన్నీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం.
గురువారం సాయంత్రం సమ్మక్క తల్లి గద్దె కు రానున్న సందర్బంగా పూజారులు గద్దెలకు చేరుకొని ఈరోజు ప్రత్యేక పూజలు చేసారు.వనం నుండి వన దేవత రానున్నడంతో వనం నుండి తెచ్చిన వెదురు ను గద్దెల వద్ద నాటి తల్లి కి ఆహ్వానం పలికారు. వారి వారి సాంప్రదాయాల ప్రకారం దాదాపు గంట సేపు సమ్మక్క గద్దె వద్ద పూజారులు విశేష పూజలు చేసారు.సమ్మక్క రాక సందర్బంగా దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గద్దె ల ప్రాంగణం వద్ద అన్నీ ఏర్పాట్లు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *