Commencement of training of sectoral officers : సెక్టోరల్ అధికారుల శిక్షణ ప్రారంభం

సిరా న్యూస్,జగిత్యాల,
రాబోయే పార్లమెంట్ ఎన్నికలు-2024 ను దృష్టిలో ఉంచుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమీకృత భవనంలో గల సమావేశ మందిరంలో కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన సెక్టోరల్ అధికారులకి ఎన్నికల విధులు విధానాల గురించి శిక్షణ ప్రారంభమైంది.జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కోరుట్ల రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్,రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ డాక్టర్ పడాల తిరుపతి పాల్గొని సెక్టరు అధికారుల విధివిధానాలు చేయదలచినవి, చేయకూడనవి ఎన్నికల కమిషన నియమావళి అనుసరించి నడుచుకోవాలని తమకు కేటాయించిన సెక్టర్ పరిధిలో గల పోలింగ్ స్టేషన్లో పరిశీలించి కనీస వసతులు, వల్నారబిలిటీ మ్యాపింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి పట్ల, ఉన్నతాధికారులతో సమాచార లోపం లేకుండా సెక్టార్ మ్యాపింగ్ తో పాటుగా రూటు రూట్ ప్లాన్ తదితర అంశాలతో పాటుగా సమగ్ర నివేదికను రెండు రోజుల్లో రిటర్నింగ్ అధికారులకు అందించాలని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్న నివృత్తి చేసుకోవాలని,సెక్టార్ ఆఫీసర్ మాన్యువల్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *